తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో 3,100 టీచర్లు, 12,882 సహాయకుల ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఈసారి కనీస విద్యార్హతగా ఇంటర్ను తప్పనిసరి చేయడంతో పాటు, కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంటర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తూ.. వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ కల్పించారు. అభ్యర్థులు ఖచ్చితంగా స్థానికులై ఉండాలి.