తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అంగన్వాడీల్లో చిన్నారులు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం, ఇతర పౌష్ఠికాహారం అందిస్తుండగా.. త్వరలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వనున్నారు.