తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట అంతరించిపోయే ప్రమాదంలో పడింది. గత 12 సంవత్సరాల కాలంలో వీటి సంతతి 30 శాతం తగ్గింది. దీంతో ఐయూసీఎన్ వీటిని అంతరించిపోయే జాబితాలో చేర్చింది. ఈ పక్ష జాతి సంతతి తగ్గిపోవడానికి క్రిమి సంహారకాలు, పట్టణీకరణ, స్వార్థపరుల వేధింపులు దీనికి ప్రధాన కారణాలు. తెలంగాణలో విజయదశమి రోజున ఈ పక్షిని చూడటం అత్యంత శుభసూచికంగా భావిస్తారు. అలాంటి పక్షిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.