ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఎంస్ఎంఈ పార్కులు నెలకొల్పారు. ఈ పార్కులలో ఏర్పాటు చేసిన ప్లాట్లకు పారిశ్రామిక వేత్తల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 293 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తాడిపత్రి , కూడేరు, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇవి అందుబాటులో ఉన్నాయి.