విశాఖలో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా జగదాంబ కూడలిలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ సమస్యకు చెక్ పడనుంది. అలాగే వీఎంఆర్డీఏ భవనం సమీపంలోనూ మరో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ నిర్మిస్తున్నారు. జగదాంబ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కోసం రూ.11 కోట్లు జీవీఎంసీ ఖర్చు చేసింది.