మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 11న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తనకు నోటీసులు అందలేదని.. అసలు ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిచారో తెలియదని అంబటి రాంబాబు పేర్కొనడం గమనార్హం.