Visakhapatnam 28000 House Pattas Distribution: విశాఖపట్నం జిల్లాలో పేదలకు చంద్రబాబు తీపికబురు చెప్పారు. మొత్తం 11 మండలాల్లో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గృహ స్థలాలను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు 28 వేలపేద కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులతో కూడిన భూమి పట్టాలు జారీ చేశారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నం వస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.