తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో ఈడీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్చంద్ మాంగ్లాను ఈడీ అరెస్ట్ చేసింది. 2019-24 మధ్య టీటీడీకి సుమారు రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు ఈడీ పేర్కొనగా.. అందులో దాదాపు రూ.96 కోట్ల కల్తీ నెయ్యిని మాంగ్లా యూనిట్లో తయారు చేసినట్లు ఆరోపించింది. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో నెయ్యి తయారు చేసి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా చూపించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.