హైదరాబాద్లో భూ ఆక్రమణలను అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన 'హైడ్రా' సంస్థ, ముఖ్యమంత్రి ప్రారంభించినప్పటి నుండి వేలాది ఫిర్యాదులను స్వీకరిస్తూ.. వాటిపై వేగంగా చర్యలు తీసుకుంటోంది. నేడు మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడలో రహదారి ఆక్రమణలు, మణికొండ తిరుమల హిల్స్ కాలనీ పార్కులోని కట్టడాలను హైడ్రా తొలగించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఆక్రమణదారులపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రజలు హైడ్రా కార్యకలాపాలను ప్రశంసిస్తూ.. తమ జిల్లాల్లో కూడా ఇలాంటి సంస్థలు కావాలని కోరుకుంటున్నారు.