రష్యా, ఉక్రెయిన్ కొట్టుకుంటే.. ఇండియాకు చవకగా ఆయిల్ దొరికినట్లు.. ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పోటీ.. ఓ ఊరిలో జనానికి పండగ తెచ్చింది. ఇద్దరు చికెన్ షాపు యజమానులు జనాలను ఆకర్షించేందుకు పోటీపడటంతో కర్నూలు జిల్లా కోడుమూరులో కిలో చికెన్ రూ.100కు చేరింది. దీంతో కోడుమూరుతో పాటుగా ఆ పక్కనే ఉన్న ఊరి జనాలు కూడా పెద్దసంఖ్యలో కోడుమూరు చేరుకున్నారు. ఈ చికెన్ షాపుల వద్ద చికెన్ కొనుగోలు చేసి ఆదివారం రోజున నాన్ వెజ్ పండుగ చేసుకున్నారు.