తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించే లక్ష్యంతో ఈ నెల 14న తలపెట్టిన రాష్ట్ర బంద్ను, బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. 76 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై పోరాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జేఏసీ చైర్మన్గా ఎంపీ ఆర్. కృష్ణయ్యను నియమించారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థాన ఇచ్చిన స్టేను ఆయన ప్రశ్నించారు. చట్టసభల్లో బిల్లు పెట్టేవరకు ఉద్యమం కొనసాగుతుందని కృష్ణయ్య తెలిపారు.