Akshaya Tritiya Chaganti Koteswara Rao Video: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగారం కొంటే కలి పురుషుడు ఇంటికి వస్తాడని, నీటి కుండను దానం చేస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తుందని ఆయన అన్నారు. పేదలకు గొడుగు, చెప్పులు, నవధాన్యాలు దానం చేయాలని, శివుడికి తెల్లబట్ట కట్టి దర్శనం చేయించాలని సూచించారు. నీటి కుండ దానం చేయలేనివాడు దరిద్రుడని ఆయన పేర్కొన్నారు.