ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని.. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.