అన్నవరం ఆలయం అరుదైన సందర్భానికి వేదికైంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన తొమ్మిది జంటలు అన్నవరం సత్యదేవుని సమక్షంలో రెండోసారి పెళ్లి చేసుకున్నాయి. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం. తొలిసారి పెళ్లి జరిగిన సమయంలో ముహూర్త దోషాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న సిద్ధాంతి సూచనతో వీరంతా రెండోసారి పెళ్లిపీటలెక్కడం గమనార్హం.