అదానీ చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..సైలెంట్‌‌గా ప్రైవేటీకరణ.. షర్మిల సంచలన కామెంట్స్

8 months ago 22
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం అమ్మేది లేదని చెబుతూనే.. నెమ్మదిగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అదానీ చేతిలో పెడుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం చంద్రబాబు ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అందుకే ఉద్యోగులను వేధిస్తూ, భూములను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. అందుకే దీనిపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article