హైదరాబాద్లో హైడ్రా (HYDRA) సంస్థ ప్రభుత్వ భూములను కాపాడుతూ గొప్ప విజయాన్ని సాధిస్తోంది. రూ. వందల కోట్ల విలువైన స్థలాలను కబ్జాదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు బంజారాహిల్స్లోని రూ.750 కోట్ల భూమి రక్షణ దీనికి తాజా ఉదాహరణ. హైడ్రా మాదిరిగానే రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కూడా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగిన చోట కబ్జాలు పెరగకుండా.. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు జోనల్ స్థాయిలో ఇలాంటి వ్యవస్థల ఆవశ్యకత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.