మొంథా తుఫానుతో నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్కు పెను ప్రమాదం తప్పింది. సంగం బ్యారేజీలోకి కొట్టుకొచ్చిన భారీ బోటును అధికారులు చాకచక్యంగా గురువారం తొలగించారు. లక్షల క్యూసెక్కుల వరద మధ్య, ప్రాజెక్టుకు ఎటువంటి నష్టం జరగకుండా వారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇది స్థానికులను, అధికారులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఘటనపై అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.