ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారిని జైలుకు పంపిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. ఇక ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్ జగన్.. వాటిని గవర్నర్కు అందించనున్నారు. అవసరమైతే వీటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.