అనంతపురం జిల్లా ప్రజలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మన్ కీబాత్ వేదికగా అభినందనలు తెలిపారు. నీటి కొరతతో ఇబ్బందులు పడే అనంతపురం జిల్లావాసులు.. ప్రస్తుతం తమ సమస్యను పరిష్కరించుకునేందుకు నడుం కట్టారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారంతో జలాశయాలను పునరుద్ధరించుకుంటూ తమ సమస్యను పరిష్కారం కనుగొంటున్నారని అభినందించారు. జల సంరక్షణ చర్యలతో పాటుగా పచ్చదనం కూడా పెంపొందించేందుకు కృషి చేస్తు్న్నారని మోదీ అన్నారు.