Anantapur TDP Leader Mysura Reddy vs CI Srikanth Yadav: అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమావేశం నేపథ్యంలో అనధికారిక వ్యక్తులు బయటకు వెళ్లాలంటూ అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ సూచించారు. ఈ క్రమంలోనే నన్నే బయటకు పొమ్మంటావా అంటూ టీడీపీ నేత మైసూరారెడ్డి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి సద్దుమణిగింది.