Anantapur Farmers Land Donation: అనంతపురం జిల్లాలో రైతులు ఊరి బాగు కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో ప్రజల ఇబ్బందుల్ని గమనించి తమ సొంత భూమిని దానం చేశారు. కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. అయితే సరైన భవనాలు, వసతులు లేకపోవడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు.. అందుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణం కోసం తమ భూమిని దానం చేశారు.