హైదరాబాద్ నగర ట్రాఫిక్ను తగ్గించేందుకు నగరంలో డబుల్ డెక్కర్ కారిడార్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. విజయవాడ వెళ్లే మార్గంలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మధ్య ఈ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.940 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. 3 హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు కూడా ఇదే ప్రాంతానికి రానున్నాయని స్పష్టం చేశారు.