Anakapalli Hospital 4.8 Kgs Baby: అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో 4.8 కిలోల బరువున్న మగ శిశువు సాధారణ ప్రసవంలో జన్మించాడు. పెందుర్తికి చెందిన రూపవతికి ఈ అరుదైన ప్రసవం జరిగింది. వైద్యులు, సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి, క్లిష్టమైన పరిస్థితిలోనూ తల్లీబిడ్డలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో విజయం సాధించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ అనకాపల్లి జిల్లా వైద్య బృందాన్ని అభినందించారు.