అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే బ్యాంకును దోపిడీ చేసేందుకు దుండగులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏకంగా బ్యాంక్ మేనేజర్ను.. తుపాకీతో బెదిరించి.. దొంగతనం చేసేందుకు యత్నించారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన బ్యాంక్ మేనేజర్.. ధైర్యంగా సెక్యూరిటీ అలారం నొక్కడంతో.. దుండగులు పారిపోయారు. దీంతో పోలీసులు బ్యాంక్కు చేరుకుని.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.