అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు వెలుగుచూశాయి. పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చెట్ల నరికివేత విషయంలో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామసభ ఏర్పాటు చేయగా.. గ్రామసభలో మాటామాటా పెరగటంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం.