తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈసారి ఆయన సొంత పార్టీ నేతపైనే అసహనం, అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అది కూడా హోం మంత్రి వంగలపూడి అనితపై కావటం చర్చకు దారితీసింది. హోం మంత్రి అనిత తనను, ఎమ్మె్ల్యేను అవమానిస్తున్నారంటూ జేసీ అనటం టీడీపీ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. అసలు ఏమైంది.. జేసీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేదీ ఇప్పుడు తెలుసుకుందాం.