అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జులై నెలలో పీఎం కిసాన్ యోజనతో నిధులు విడుదల చేసిన రోజే.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తామని చంద్రబాబు వెల్లడించాుర.