ఏపీవాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి మరో రెండు హామీలు అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మే నెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నట్లు టీడీపీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్తికి ఏటా రూ.15000 చొప్పున అందించనున్నారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20000 అందించనున్నారు.