Annadata Sukhibhava Scheme Alert To Farmers: అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులను ఈ నెల 19న విడుదల చేయనుంది. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హత ఉండి కూడా సాంకేతిక లోపాల వల్ల లబ్ధి పొందలేని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది.