అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్రంతో కాకుండా వేరుగా అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కాకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు రూ.20 వేలు చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఈ మేరకు మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రంతో కలిసి పథకాన్ని అమలు చేయడం, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించటం రైతులకు చేసిన నమ్మకద్రోహమని మండిపడ్డారు.