ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ మీద సేవా ఛార్జీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వెబ్ ల్యాండ్ రికార్డుల్లో తప్పుల కారణంగా ఏపీలోని 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రైతుల రికార్డుల సవరణ కోసం సేవా ఛార్జీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 సేవా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే 5.44 లక్షల మంది రైతులకు రూ.2.72 కోట్ల సేవా చార్జీని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.