Annadata Sukhibhava Scheme 2025 Status Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హుల జాబితా ఇప్పటికే విడుదల కాగా, పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రైతులు తమ ఫిర్యాదులను రైతు సేవా కేంద్రాల్లో అందజేయవచ్చు. అర్హత వివరాలను వెబ్సైట్లో ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.