ఏపీ రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల జమపై కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే రెండు విడతల్లో ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రూ.14000 జమ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మూడో విడత కింద రూ.6000 అందించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.