కాలు కదపకుండా.. ఒళ్లు వంచకుండా.. అసలేం పని చేయకుండా.. డబ్బులు సంపాదించాలని భావించి.. అందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. ఇతరుల శ్రమను దోచుకుని.. వారు జల్సాలు చేస్తున్నారు. ఇళ్లు, గుళ్లు ఆఖరికి విద్యా సంస్థలను కూడా వదలడం లేదు దొంగలు. తాజాగా హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడి చోటు చేసుకుంది. ఏకంగా కోటి రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీలో ఈ దోపిడీ చోటు చేసుకుంది. ఆ వివరాలు..