Amaravati Railway Line Land Acquisition: కేంద్రం సాయంతో చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో పలు రోడ్డు, రైలు మార్గాల పనులను పరుగులు పెట్టిస్తోంది. ఈక్రమంలో అమరావతి మీదుగా వేయబోయే రైల్వే లైన్కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ లైన్ కోసం 77 ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించనుంది. చిలుకూరు, దాములూరు గ్రామాల్లో భూసేకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టుతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.