అమరావతిలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో ప్రాకారం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 27న కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే తిరుచానూరులో శ్రీవారి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు చిన్నశేష వాహనంలో భక్తులను ఆశీర్వ దించారు. ఇటు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన పట్టువస్త్రాలు చెందించారు. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తిరుచానూరు, తిరుమల సందర్శనకు రానున్నారు.