Amaravati Errupalem Railway Line Farmers On Land: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, గుంటూరు, పల్నాడు జిల్లాల రైతులు భూసేకరణకు బదులుగా భూసమీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొత్త తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తేనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది అంటున్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది రైల్వేశాఖ.