అమరావతిని శాశ్వత వరద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా రూ. 2062 కోట్ల అంచనా వ్యయంతో.. గతంలోనే వరద నిర్వహణ పనుల డిజైన్లకు ఆమోదం తెలిపింది. తాజాగా, రూ. 595 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 8,400 క్యూసెక్కుల గరిష్ఠ సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. గతంలో మొదటి పంపింగ్ స్టేషన్ను ఉండవల్లి ప్రాంతంలో నిర్మించిన సంగతి తెలిసిందే.