Rs 2.40 Crore Per Acre In Amaravati: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియలో రైతులకు పరిహారం మంజూరు చేశారు. అలాగే ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 8న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో అవార్డు నంబర్.1/2026ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలో 11 మంది రైతుల నుంచి 2.725 ఎకరాల భూమిని తీసుకుని.. రూ.7,14,23,788 పరిహారం మంజూరు చేసింది. రైతులు ఈ చెక్కుల్ని తీసుకోవడానికి నిరాకరించడంతో విజయవాడ ఆర్అండ్ఆర్ కోర్టు ఈ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది.