అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. డీపీఆర్ తయారీకే అన్ని రూ. కోట్లా?

4 months ago 19
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు దిశగా ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా నీరుకొండ వద్ద ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విగ్రహం గురించి కూడా అప్ డేట్ వచ్చింది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు డీపీఆర్ తయారీ పనులను షీలాడియా అనే సంస్థకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం డీపీఆర్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం రూ.11.56 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article