రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు కానుంది. మార్చి 16న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. శాఖమూరు ప్రాంతంలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం నిర్మస్తున్నారు. ఈ స్మృతి వనంలోనే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.