ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రెండో దశ భూసేకరణకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో 20,494 ఎకరాల భూమిని సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. అంతేకాకుండా, అమరావతిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ల నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు కూడా సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.