ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతి ఐ పేరుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన ఫెర్రిస్ వీల్ కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్ ప్రకటన జారీ చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్ వీల్ ఎయిర్ దుబాయ్ను తలదన్నేలా 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్ వీల్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.