అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం నిధులు, పాలనా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. అమరావతిలో 212 కోట్ల రూపాయలతో రాజ్ భవన్ నిర్మించాలని ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా సీఎఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 212 కోట్లతో అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణం కోసం జీవో జారీ చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో దీనిని నిర్మించనున్నారు.