హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో కీలకమైన ఎంఎంటీఎస్ (MMTS) సేవలు ప్రారంభమై 22 ఏళ్లయినా, ఆశించిన స్థాయిలో విస్తరణ కరవైంది. సమయపాలన లేకపోవడం, పరిమిత రైళ్లే దీనికి కారణం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ల పునరుద్ధరణ నేపథ్యంలో విస్తరణకు ఇదే సరైన సమయమని ప్రయాణికులు అంటున్నారు. సికింద్రాబాద్- ఫలక్నుమా-మేడ్చల్ మార్గంలో ఆరు కోచ్ల రైళ్లను నడపాలని, కార్యాలయ వేళలకు అనుగుణంగా రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తున్నారు.