అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

5 months ago 9
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని డెంటన్‌లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన 27 ఏళ్ల పోలే చంద్రశేఖర్ మృతిచెందాడు. డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ పూర్తి చేసిన చంద్రశేఖర్, 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఆరు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ పనిచేస్తుండగా గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. గాయాల కారణంగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Read Entire Article