Ancient Coin Found In Hundi: తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ముగియడంతో అమ్మవారి ఆలయాల్లో హుండీల లెక్కింపు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో దుర్గామాత హుండీ లెక్కింపులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వెయ్యేళ్ల క్రితం గంగైకొండ చోళ పురాన్ని పాలించిన రాజేంద్ర చోళుడి కాలం నాటి పురాతన నాణెం బయటపడింది. రూ.1,27,137 నగదుతో పాటు లభించిన ఈ చారిత్రక నాణేన్ని ప్రభుత్వానికి అప్పగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ అరుదైన ఆవిష్కరణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.