గచ్చిబౌలిలో ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్ఈఎల్ కాలనీకి చెందిన షాహిర్ శ్రీకాంత్ అనే నిందితుడు.. యువతుల ఫోటోలను రహస్యంగా తీసి, వాటిని మార్ఫింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అతని ఫోన్లో వందలాది మంది మహిళల మార్ఫింగ్ చేసిన ఫోటోలు లభించాయి.