Visakhapatnam Tourism Oji Caravan Bus: ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ, ఓజీ డ్రీమ్లైనర్ సంస్థ కలిసి విలాసవంతమైన కారవాన్ బస్సులను త్వరలో ప్రవేశపెడుతున్నాయి. విశాఖపట్నం నుండి అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు ఇవి అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఏసీ పడక గదులు, వంటగది, టీవీ, వైఫై వంటి సౌకర్యాలతో రెండు కుటుంబాలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.2,500తో రాత్రి బసతో కూడిన ప్యాకేజీలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.