నల్గొండలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా అనంతరం డ్రగ్స్ వినియోగం పెరిగిందని.. ముఖ్యంగా విద్యార్థుల్లో డ్రగ్స్ వాడకం పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.